కారును ఢీకొన్న లారీ.. యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-10-17T05:07:03+05:30 IST
కారును ఢీకొన్న లారీ.. యువకుడి మృతి
- మరో ఇద్దరికి గాయాలు
నందిగామ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన నందిగామ పోలీ్సస్టేషన్ సమీపంలోని పాత జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మండల పరిఽధి అప్పారెడ్డిగూడకు చెందిన చంటి వినోద్(24) అదే గ్రామానికి చెందిన సర్పంచ్ వద్ద డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి కారులో సర్పంచ్ బంధువులను జంగోనిగూడలో దింపేసి తిరుగు ప్రయాణంలో అప్పారెడ్డిగూడకు వెళ్తున్నాడు. నందిగామ శివారు రైతువేదిక సమీపంలో పాతజాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ అతివేగంగా మరొక లారీనీ ఓవర్టేక్ చేస్తూ కారును ఢీకొనడంతో పాటు లారీ బోల్తాపడింది. ప్రమాదంలో వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ గాయపడి లారీలో ఇరుక్కుపోయారు. స్థానికులు వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. వినోద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ కమ్యూనిటీ అసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపారు.