అబ్దుల్లాపూర్మెట్లో లారీ బీభత్సం
ABN , First Publish Date - 2021-12-11T23:47:36+05:30 IST
జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ దగ్గర లారీ
రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కన విద్యార్థుల పైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ లారీ వెళ్తోంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.