గుండెపోటుతో లారీ క్లీనర్ మృతి
ABN , First Publish Date - 2022-08-19T06:23:16+05:30 IST
గుండెపోటుతో నిద్ర లోనే లారీ క్లీనర్ మృతి చెందాడు. ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం ఖజుహట్ట దారిహెరాకు చెందిన మృత్యం ఆదిత్యకుమార్(27) సూర్యాపేట- ఖమ్మం రహదారి విస్తరణ పనులు చేపడు తున్న డీఆర్ఎన్ కంపెనీలో లారీ క్లీనర్గా పని చేస్తున్నాడు.
మోతె, ఆగస్టు 18: గుండెపోటుతో నిద్ర లోనే లారీ క్లీనర్ మృతి చెందాడు. ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం ఖజుహట్ట దారిహెరాకు చెందిన మృత్యం ఆదిత్యకుమార్(27) సూర్యాపేట- ఖమ్మం రహదారి విస్తరణ పనులు చేపడు తున్న డీఆర్ఎన్ కంపెనీలో లారీ క్లీనర్గా పని చేస్తున్నాడు. కంపెనీలో ఉన్న మెస్లో బుధవారం రాత్రి భోజనంచేసి తోటి వారితో నిద్రించాడు. గురువారం ఉదయం పక్క బెడ్ మీద ఉన్న మహేష్ నిద్రలేపినా అతడు లేవలేదు.. వెంటనే కంపెనీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వైద్యులు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని వైద్యులు భావి స్తున్నారు. మృతదేహానికి సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి సోదరుడు మృత్యం జయప్రకాష్రామ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.