లారస్ లాభం రూ.242 కోట్లు
ABN , First Publish Date - 2020-10-30T06:25:12+05:30 IST
సెప్టెంబరు త్రైమాసికంలో లారస్ ల్యాబ్స్ రూ.1,139 కోట్ల ఆదాయంపై రూ.242 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 60 శాతం, నికర లాభం 325శాతం పెరిగినట్లు వెల్లడించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సెప్టెంబరు త్రైమాసికంలో లారస్ ల్యాబ్స్ రూ.1,139 కోట్ల ఆదాయంపై రూ.242 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 60 శాతం, నికర లాభం 325శాతం పెరిగినట్లు వెల్లడించింది. కాగా రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై 80 పైసల మధ్యంతర డివిడెండ్ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. అన్ని విభాగాల్లో పనితీరు ఆశాజనకంగా ఉండడం వల్ల సెప్టెంబరు త్రైమాసికంలో ఆదాయం 60 శాతం పెరిగిందని లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ సత్యనారాయణ చావా తెలిపారు. ఫార్ములేషన్స్ వ్యాపారం ఆదాయం 180శాతం పెరిగిందన్నారు.