రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా లసిత్ మలింగ
ABN , First Publish Date - 2022-03-11T22:20:43+05:30 IST
శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగను రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా
న్యూఢిల్లీ: శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగను రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా నియమించింది. ప్రస్తుతం ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్గా శ్రీలంకకే చెందిన కుమార సంగక్కర వ్యవహరిస్తున్నాడు. గతంలో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించిన మలింగ ఆ జట్టు నాలుగు టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. చివరిసారి 2019 ఐపీఎల్లో ఆడాడు. 170 వికెట్లతో ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
గతేడాది జనవరిలో క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు మలింగ ప్రకటించారు. 2008లో ఐపీఎల్ ఆరంభ ట్రోఫీని గెలుచుకున్న రాజస్థాన్ రాయల్స్ గత సీజన్లో ప్లే ఆఫ్స్కు కూడా అర్హత సాధించలేకపోయింది. 10 పాయింట్లో ఏడో స్థానంలో నిలచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో షిమ్రన్ హెట్మయెర్, డేవదత్ పడిక్కల్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాళ్లను కొనుగోలు చేసిన రాజస్థాన్ బలంగా కనిపిస్తోంది.