ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లకు నేటితో గడువు పూర్తి

ABN , First Publish Date - 2021-01-17T05:54:48+05:30 IST

ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశాలకు చివరి రోజు ఆదివారం అయినప్పటికీ.. విద్యా ర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కళాశాలల యాజమాన్యాలను ఆదేశించిన ట్లు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి బి.ప్రభాకర రావు పేర్కొన్నారు.

ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లకు నేటితో గడువు పూర్తి

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 16 : ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశాలకు చివరి రోజు ఆదివారం అయినప్పటికీ.. విద్యా ర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కళాశాలల యాజమాన్యాలను ఆదేశించిన ట్లు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి బి.ప్రభాకర రావు పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి మే 31వ తేదీ వరకు 106 పనిదినాల్లో ఫస్టియర్‌ తరగతులు జరుగుతాయని తెలిపారు. తొలి విడత అడ్మిషన్ల ప్రక్రియ ను పూర్తిగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ విధానంలో అమలు చేయాలని ఆదేశించారు. మిగిలిన ఖాళీల వివరాలను కళాశాల నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. రెండో విడత అడ్మిషన్ల భర్తీ తేదీ త్వరలో ప్రకటిస్తారన్నారు. 


Updated Date - 2021-01-17T05:54:48+05:30 IST