కరోనా మృతుడికి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-06-21T04:35:34+05:30 IST

ప్రస్తుత పరిస్థితులలో ఎవరికైనా కరోనా సోకిందంటే చాలు అటు వెళ్లేందుకు జంకుతున్నారు. ఒకవేళ కరోనా సోకిన వ్యక్తి చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు సొంతవాళ్లు కూడా వెనకాడుతున్నారు.

కరోనా మృతుడికి అంత్యక్రియలు
అంత్యక్రియలు నిర్వహిస్తున్న ట్రస్ట్‌ సభ్యులు

మానవత్వం చాటుకున్న బట్టా మల్లయ్య ట్రస్ట్‌

బూర్గంపాడు, జూన్‌ 20: ప్రస్తుత పరిస్థితులలో ఎవరికైనా కరోనా సోకిందంటే చాలు అటు వెళ్లేందుకు జంకుతున్నారు. ఒకవేళ కరోనా సోకిన వ్యక్తి చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు సొంతవాళ్లు కూడా వెనకాడుతున్నారు. అలాంటిది కరోనా మృతదేహానికి బట్టా మల్లయ్య మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ బట్టా విజయగాంధీ అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నాడు. బూర్గంపాడు మండల పరిదిలోని కృష్ణసాగర్‌ ఎస్‌టీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి(38) శనివారం బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానికులు, బంధువులు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న బట్టా మల్లయ్య మెమోరియల్‌ చారిటబుల్‌ అద్యక్షుడు బట్టా విజయగాంధీ, ట్రస్ట్‌ సభ్యులు తాటి సత్యనారాయణ, బండారి వంశీ, కారం సందీప్‌ పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2021-06-21T04:35:34+05:30 IST