TS News: చిక్కడపల్లిలో లాయర్‌ శివారెడ్డి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-23T02:37:35+05:30 IST

చిక్కడపల్లి పీఎస్ పరిధిలోని భాగ్‌లింగంపల్లిలో కడపకు చెందిన న్యాయవాది శివారెడ్డి లైసెన్స్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

TS News:  చిక్కడపల్లిలో లాయర్‌ శివారెడ్డి ఆత్మహత్య

హైదరాబాద్(hyderabad): చిక్కడపల్లి(Chikkadapally) పీఎస్ పరిధిలోని భాగ్‌లింగంపల్లిలో కడప(kadapa)కు చెందిన న్యాయవాది శివారెడ్డి(44)(sivareddy) లైసెన్స్ గన్‌(Licensed gun)తో కాల్చుకుని ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు. అతను గతంలో ఎయిర్‌ఫోర్స్ నుంచి సార్జెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్నారు. శివారెడ్డి భార్య నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. ఈరోజు ఉదయం 6 గంటలకు కడప నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అతను టీ తాగి తన పోర్షన్‌లోకి వెళ్లి లోపలి నుంచి బోల్ట్‌ పెట్టుకున్నాడు. శివారెడ్డి సోదరి మహేశ్వరి పలుసార్లు ఫోన్ చేసిన, అతను కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె కవాడిగూడలో ఉంటున్న తన స్నేహితురాలు లక్ష్మి భవానికి ఫోన్ చేసి తెలిపింది. వెంటనే శ్రీమతి లక్ష్మి భవాని తన తల్లితో కలిసి వాచ్‌మెన్ దుర్గాప్రసాద్ సహాయంతో తలుపు గడియ పగులగొట్టి లోపలికి ప్రవేశించగా శివారెడ్డి అప్పటికే మరణించి బెడ్‌పై ఉన్నాడు. శివారెడ్డి సెల్‌ఫోన్‌‌ని  చిక్కడపల్లి పోలీసులు సీజ్‌ చేశారు. క్లూస్ టీమ్, వేలిముద్రల బృందం ఘటనాస్థలిని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియాకి  చిక్కడపల్లి పోలీసులు తరలించారు. 

Updated Date - 2022-07-23T02:37:35+05:30 IST