లక్ష్మీ బ్యారేజీలో 4.31టీఎంసీల నీరు
ABN , First Publish Date - 2021-03-02T05:16:28+05:30 IST
లక్ష్మీ బ్యారేజీలో 4.31టీఎంసీల నీరు
మహదేవపూర్ రూరల్, మార్చి 1 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ బ్యారేజీలో సోమవారం వరకు 4.31టీఎంసీల నీరునిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పారు. బ్యారేజీలోకి ప్రాణహిత నది నుంచి 3,850 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా, బ్యారేజీ అన్ని గేట్లు మూసివేసి నీటిని నిల్వ చేస్తున్నామని అధికారుల తెలిపారు.