‘బెదిరిస్తే సహించం’

ABN , First Publish Date - 2021-03-03T06:15:08+05:30 IST

నంద్యాల మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్థులను ఉపసంహరించుకోవాలంటూ అధికార పార్టీ నాయకుల బెదిరిస్తే సహించేది లేదని కాంగ్రెస్‌ పార్టీ నంద్యాల పార్లమెంట్‌ డీసీసీ అధ్యక్షుడు జే లక్ష్మీనరసింహయాదవ్‌ అన్నారు.

‘బెదిరిస్తే సహించం’

  • నంద్యాల, మార్చి 2: నంద్యాల మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్థులను ఉపసంహరించుకోవాలంటూ అధికార పార్టీ నాయకుల బెదిరిస్తే    సహించేది లేదని కాంగ్రెస్‌ పార్టీ నంద్యాల పార్లమెంట్‌ డీసీసీ అధ్యక్షుడు జే లక్ష్మీనరసింహయాదవ్‌ అన్నారు. మంగళవారం కాంగ్రెస్‌ అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి బీ ఫారంలను అందజేశారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ ఎమ్మెల్యే, వారి అనుచరులు రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్లో నీతి, నిజాయితీగా పోటీ చేసి గెలవాలని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభ్యర్థులను బెదిరిస్తూ విత్‌డ్రా అయ్యే విధంగా చేయడం సరైన పద్ధతికాదని అన్నారు. ఎన్‌ఆర్‌సీ విషయంలో వైసీపీ, టీడీపీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఢిల్లీలో బీజేపీకి జైకొట్టి, స్థానికంగా మాత్రం మైనార్టీలకు మద్దతు ఇస్తున్నట్లుగా  నాటకం ఆడుతున్నాయని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి భరత్‌కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-03T06:15:08+05:30 IST