పుట్టాకు గ్రీన్ సిగ్నల్పై నేతల సంబరాలు
ABN , First Publish Date - 2022-06-29T05:06:18+05:30 IST
వచ్చే ఎన్నికల్లో మైదు కూరు టీడీపీ అభ్యర్థిగా టీటీడీ మాజీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నియోజకవర్గం నేతలు సంబ రాలు చేసుకున్నారు.
మైదుకూరు/దువ్వూరు/బి.మఠం, జూన్ 28: వచ్చే ఎన్నికల్లో మైదు కూరు టీడీపీ అభ్యర్థిగా టీటీడీ మాజీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నియోజకవర్గం నేతలు సంబ రాలు చేసుకున్నారు. సోమవారం రాత్రి హైదరాబాదులోని చంద్రబాబు ని వాసంలో కలసిన పట్టాకు ఇక ప్రచారం చేసుకొమ్మని చెప్పినట్లు తెలు సుకున్న నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. దీంతో మంగళవా రం ఉదయం మైదుకూరులోని రాయల్ కూడలిలో బాణసంచా పేల్చి మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దాసరి బాబు నేతలు ఆకుల క్రిష్ణయ్య, పాశం మారుతి, పాల మాబు, గౌస్, మాబూషరీప్, రాకెట్ రఫీ పాల్గొన్నారు.
సుధాకర్ యాదవ్కు గ్రీన్ సిగ్నల్ విషయం తెలుసుకున్న అభిమా నులు కొందరు హైదారాబాదులోని ఆయన కార్యాలయం చేరుకుని పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో మైదుకూరు, చాపాడు, బి మఠం టీడీపీ మండల అధ్యక్షులు అన్నవరం సుధాకర్ రెడ్డి, చెన్నుపల్లె సుబ్బారెడ్డి, భీమయ్య, నేతలు శీర్ల నాగమోహన్, నారపురెడ్డి సుదర్శన్, అశోక్రెడ్డి, రాజుపాళెం శీను పాల్గొన్నారు.
దువ్వూరులో....
సుధాకర్ యాదవ్కు గ్రీన్ సిగ్నల్పై రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి పుట్టా గెలుపే ధ్యేయంగా ముందుకెళ్లాలని దువ్వూరు మండల టీడీపీ కన్వీనర్ బోరెడ్డి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా రెట్టింపు ఉత్సాహంతో సుధాకర్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు.
బి.మఠంలో....
సుధాకర్ యాదవ్కు గ్రీన్ సిగ్నల్పై మల్లేపల్లె సర్పం చ్ చిలమల లక్ష్మీదేవి, మాజీ డీసీసీ చైర్మన్ చిలమల నారాయణ, మండల టీడీపీ అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశా రు. నియోజకవర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.