టీడీపీ సభ్యత్వంతో భరోసా

ABN , First Publish Date - 2022-05-22T05:54:06+05:30 IST

టీడీపీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు భరోసా ఉంటుందని, వారి సంక్షేమానికి పార్టీ పాటుపడుతుందని పట్టణాధ్యక్షుడు షేక్‌ ఖాజారహంతుల్లా, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఇర్రికోటిరెడ్డి అన్నారు.

టీడీపీ సభ్యత్వంతో భరోసా
సభ్యత్వాలను నమోదు చేయిస్తున్న నాయకులు

పామూరు, మే 21 : టీడీపీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు భరోసా ఉంటుందని, వారి సంక్షేమానికి పార్టీ పాటుపడుతుందని పట్టణాధ్యక్షుడు షేక్‌ ఖాజారహంతుల్లా,  జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఇర్రికోటిరెడ్డి అన్నారు. 5, 6, వార్డల్లో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. కార్యకర్తలకు రూ.2లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య బీమా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రధానకార్యదర్శి గుత్తి మహేష్‌, ఐ-టీడీపీ కోఆర్డినేటర్‌ ఫత్తు మస్తాన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-22T05:54:06+05:30 IST