వెంకన్న సేవలో కంగనా రనౌత్‌

ABN , First Publish Date - 2022-05-17T08:51:20+05:30 IST

ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

వెంకన్న సేవలో కంగనా రనౌత్‌

తిరుమల, మే 16 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న ఆమెను వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు, డైరీ, క్యాలెండర్లు అందజేశారు. అనంతరం కంగనా రనౌత్‌ ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. తమ ‘ఽధాకడ్‌’ సినిమా విజయవంతమవ్వాలని శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చినట్టు తెలిపారు.

Updated Date - 2022-05-17T08:51:20+05:30 IST