-
-
Home » Andhra Pradesh » Leagal notices to Bhanu Prakash Reddy-MRGS-AndhraPradesh
-
టీటీడీకి భాను ప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు
ABN , First Publish Date - 2022-05-03T18:28:13+05:30 IST
టీటీడీకి బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు. తిరుమలలో కాటేజీల కోసం భూమి కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి.
తిరుపతి : టీటీడీకి బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు. తిరుమలలో కాటేజీల కోసం భూమి కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. సరిదిద్దుకోవాలని చెప్పినా పట్టించుకోని పాలక మండలికి నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. ఇద్దరు మాజీ టీటీడీ పాలక మండలి సభ్యుల పేర్లతో... రూ. 25 లక్షలకే తిరుమలలో స్థలాలు కేటాయించాలని పాలక మండలి నిర్ణయించిందన్నారు. బహిరంగ టెండర్లో స్థలం విలువ రూ. 12 కోట్లు పలుకుతోందన్నారు. టీటీడీ స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని బీజెపీ నేత భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు.