కౌలు రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-28T06:28:21+05:30 IST

కోవెలకుంట్ల మండలం లింగాల గ్రామానికి చెందిన కౌలు రైతు చిన్న నాగహుస్సేని (30) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

కౌలు రైతు ఆత్మహత్య

కోవెలకుంట్ల, నవంబరు 27: కోవెలకుంట్ల మండలం లింగాల గ్రామానికి చెందిన కౌలు రైతు చిన్న నాగహుస్సేని (30) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ మహ్మద్‌రిజ్వాన్‌ వివరాల మేరకు.. చిన్నహుస్సేని తనకున్న 70 సెంట్ల పొలంతోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని మూడు సంవత్సరాలుగా మిరప, వేరుశనగ సాగు చేశాడు. దిగుబడులు సరిగా చేతికందక నష్టం రావడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పు రూ.4 లక్షల దాకా పేరుకుని పోయింది. అప్పులు తీర్చే మార్గం కనిపించక తీవ్ర మనస్తాపానికి గురైన నాగహుస్సేని శనివారం క్రిమిసంహారక మందు తాగాడు. బంధువులు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా కోలుకోలేక మధ్యాహ్నం మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగహుస్సేని తండ్రి హుస్సేని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-11-28T06:28:21+05:30 IST