అధికారి పైశాచికం: ఉద్యోగి వేలిని కర్కశంగా నోటితో కొరికి....

ABN , First Publish Date - 2020-09-12T14:45:08+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన అధికారి సెలవు అడిగిన ఉద్యోగిపై ఎక్కడాలేని కోపం చూపించాడు. తన ఇంటికి వెళతానన్న పాపానికి ఆ ఉద్యోగిని చితకబాదాడు. ఆ అధికారి దెబ్బలను అడ్డుకునే...

అధికారి పైశాచికం: ఉద్యోగి వేలిని కర్కశంగా నోటితో కొరికి....

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన అధికారి సెలవు అడిగిన ఉద్యోగిపై ఎక్కడాలేని కోపం చూపించాడు. తన ఇంటికి వెళతానన్న పాపానికి ఆ ఉద్యోగిని చితకబాదాడు. ఆ అధికారి దెబ్బలను అడ్డుకునే క్రమంలో ఆ ఉద్యోగి చేయిఎత్తగా, సదరు అధికారి అతని చేతి వేలిని తన నోటితో గట్టిగా కొరికాడు. దీంతో ఆ వేలు ఊడిపడింది. అయితే వైద్యులు శస్త్ర చికిత్సచేసి, ఆ వేలిని తిరిగి అతికించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆ ఉద్యోగి సదరు అధికారిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే గజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌‌లో ఉంటున్న మోహిత్ కుమార్ ఒక ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపెనీలో పనిచేస్తుంటాడు. 



సెప్టెంబరు 4న అతను తనపై అధికారి హేమంత్ సిద్ధార్థతో పాటు కారులో కూర్చుని, కరోల్ బాగ్ వెళ్లాడు. అక్కడ పని పూర్తయ్యాక ఇద్దరూ కారులో అక్షర్‌థామ్ చేరుకున్నారు. అక్కడ మోహిత్ అధికారి హేమంత్‌తో... అనుమతిస్తే తాను ఇంటికి వెళతానన్నాడు. అయితే హేమంత్ ఇంకా పని ఉందంటూ, అతనిని గలేరియామాల్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ హేమంత్... మోహిత్‌పై దాడికి దిగాడు. అతనిని అడ్డుకునే ప్రయత్నంలో మోహిత్ తన చేతిని పైకి ఎత్తాడు. దీంతో హేమంత్.. మోహిత్ చేతి వేలిని నోటితో గట్టిగా పట్టుకుని కొరకడంతో, ఆ వేలు ఊడి కింద పడింది. మోహిత్ వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతలో హేమంత్ అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడికి వచ్చిన పోలీసులు మోహిత్‌ను ఆసుపత్రికి తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2020-09-12T14:45:08+05:30 IST