నిబంధనలు వదిలి.. దూరం మరిచి!
ABN , First Publish Date - 2021-05-11T05:02:42+05:30 IST
కరోనా సెకెండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని ఎంతగా అధికారులు చెబుతున్నా.. కొందరికి చెవికెక్కడం లేదు. అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని సూచిస్తున్నా.. అవేమీ వారికి పట్టడం లేదు.
రామభద్రపురం, మే 10: కరోనా సెకెండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని ఎంతగా అధికారులు చెబుతున్నా.. కొందరికి చెవికెక్కడం లేదు. అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని సూచిస్తున్నా.. అవేమీ వారికి పట్టడం లేదు. సోమవారం స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ వద్ద నెలకొన్న పరిస్థితే ఇందుకు నిదర్శనం. బ్యాంకు బయట క్యూలో ఉన్న ఖాతాదారులు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. బ్యాంకు లోపల లావాదేవీలకు కేవలం ఐదుగురిని మాత్రమే విడిచిపెట్టడంతో బయట రద్దీ ఎక్కువైంది. దీంతో వారంతా గుంపుగా ఉండడం కనిపించింది. భౌతిక దూరం పాటించకపోవడం గమనార్హం.