ఎంపీడీవోలకు సెలవుల రద్దు
ABN , First Publish Date - 2021-11-26T08:08:14+05:30 IST
జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఎంపీడీవోలు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఐదు రోజుల పాటు సెలవులు రద్దు చేస్తున్నట్లు జడ్పీ సీఈవో ప్రభాకర్రెడ్డి తెలిపారు.
చిత్తూరు (సెంట్రల్), నవంబరు 25: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఎంపీడీవోలు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఐదు రోజుల పాటు సెలవులు రద్దు చేస్తున్నట్లు జడ్పీ సీఈవో ప్రభాకర్రెడ్డి తెలిపారు. కలెక్టర్ సూచనల మేరకు గురువారం తన చాంబర్ నుంచి ఎంపీడీవోలకు సూచనలు చేశారు. వాగులు, వంకలు, తెగిన, పాడైన రోడ్లపై ప్రజల రాకపోకలు లేకుండా చూడాలన్నారు. వీలైతే గ్రామ పంచాయతీ పరిధిలో అదనపు కూలీలను ఏర్పాటు చేసుకుని, సహాయ చర్యలకు సిద్ధం కావాలన్నారు. కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు, జడ్పీ కార్యాలయానికి ఎప్పటికప్పుడు వర్షాల సమాచారం అందజేయాలని చెప్పారు. ఈనెల 29 నుంచి జరగాల్సిన పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమాలను వర్షాల కారణంగా వాయిదా వేసినట్లు తెలిపారు. జిల్లా పంచాయతీ వనరుల కేంద్ర జిల్లా మేనేజర్ షణ్ముగం ఈ సమావేశంలో పాల్గొన్నారు.