సీఎం జగన్కు వామపక్షాల లేఖ
ABN , First Publish Date - 2021-04-24T00:44:09+05:30 IST
సీఎం జగన్కు వామపక్షాల లేఖ
అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వామపక్ష పార్టీల నేతలు లేఖ రాశారు. కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాలని సీఎంను కోరినట్లు వామపక్షాల నేతలు లేఖలో పేర్కొన్నారు. కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని జగన్ను కోరామని వామపక్షాలు తెలిపాయి. ఆక్సిజన్ కొరత లేకుండా, ఐసీయూ బెడ్స్ ఏర్పాట్లు చేయాలని వామపక్షాలు లేఖలో డిమాండ్ చేశాయి. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని వామపక్షాల పార్టీల నేతలు లేఖలో పేర్కొన్నారు.