‘గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు’

ABN , First Publish Date - 2021-10-27T05:29:45+05:30 IST

ఆజాదీ కా అమృత మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీహెచ వెంకట నాగశ్రీనివాసరావు మంగళవారం పలు గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు.

‘గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు’

 కర్నూలు(లీగల్‌), అక్టోబరు 26:  ఆజాదీ కా అమృత మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీహెచ వెంకట నాగశ్రీనివాసరావు మంగళవారం పలు గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. గోకులపాడు, బస్తిపాడు, బొల్లవరం, కె.మార్కాపురం, నెరవాడ, పర్ల, పెద్దకొట్టాల, సల్కాపురం తదితర గ్రామాల్లో పారా లీగల్‌ వలంటీర్లతో కలిసి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి ఉచిత న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని ఆయన కోరారు. 


Updated Date - 2021-10-27T05:29:45+05:30 IST