Gutta sukhender reddy: గవర్నర్ విమోచన దినం అంటూ వ్యాఖ్యలు సరికాదు
ABN , First Publish Date - 2022-09-15T15:53:41+05:30 IST
కొంత మంది బాధ్యత లేకుండా సెప్టెంబర్ 17ను విలీనం, విమోచన దినం అంటూ ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడటం దౌర్భాగ్యమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
నల్గొండ: కొంత మంది బాధ్యత లేకుండా సెప్టెంబర్ 17ను విలీనం, విమోచన దినం అంటూ ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడటం దౌర్భాగ్యమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta sukhender reddy) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్ తమిళి సై(Tamilisi) విమోచన దినం అని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గవర్నర్ (Telangana governor) వ్యవస్థకు గౌరవం పోగొట్టొద్దని తెలిపారు. కేంద్రం (Central government) హైదరాబాద్ పరేడ్ గ్రౌడ్లో సభ నిర్వహించడం సరికాదని అన్నారు. కేంద్రం రాష్టాల హక్కులను హరిస్తూ ఇబ్బందులు పెడుతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి(Telangana Legislative Council Chairman) మండిపడ్డారు.