బద్వేలులో లెనిన జయంతి సభ
ABN , First Publish Date - 2021-04-23T04:59:49+05:30 IST
స్థానిక సుందరయ్య భవనంలో గురువారం సీపీఎం ఆధ్వర్యంలో లెనిన జయంతి సభ నిర్వహించారు.
బద్వేలు, ఏప్రిల్22: స్థానిక సుందరయ్య భవనంలో గురువారం సీపీఎం ఆధ్వర్యంలో లెనిన జయంతి సభ నిర్వహించారు. కార్యక్ర మంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ విప్లవ కార్మికోద్యమం ప్రపంచానికి అందించిన గొప్ప మేథావి లెనిన అని పేర్కొన్నారు. 20వ శతాబ్దంలో ప్రపంచ గమనాన్ని కోటానుకోట్ల మానవ మెదళ్లను కదిలించిన అనంత జనసమూహాలను ప్రత్యక్షం గా, పరోక్షంగా ప్రభావితం చేసిన వ్యక్తి లెనిన అన్నారు. కార్యక్రమం లో పట్టణ కమిటీ సభ్యులు ఎస్.ఖాదర్హుసేన, చాంద్బాష, ప్రవీణ్ కుమార్, మస్తాన, డీవైఎఫ్ఐ నేతలు రెడ్డెప్ప, నాగార్జున పాల్గొన్నారు.
మైదుకూరులో....
మైదుకూరు, ఏప్రిల్ 22: రష్యా విప్లవ కారుడు లెనిన్ పేరుతో ప్రసి ద్దుడైన వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యోనోవ్ జయంతిని ఘనంగా నిర్వహిం చారు. సీపీఐ, ఏఐటీయూసీ నేతల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటం ఉంచి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు బీవీ శ్రీనివాసు లు, పీరయ్య, బాలాజీ, పాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.