నంద్యాలలో చిరుతపులి సంచారం

ABN , First Publish Date - 2022-05-09T16:24:43+05:30 IST

జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రేగులేటర్ గేట్లపై చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.

నంద్యాలలో చిరుతపులి సంచారం

నంద్యాల: జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రేగులేటర్ గేట్లపై చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. చిరుతపులిని చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో గేట్ల వద్ద ఉన్న సిమెంట్ బెడ్ల నీడన చిరుత సేద తీరుతోంది. దీంతో పోతిరెడ్డిపాడు వైపు వెళ్లేందుకు స్థానికులు భయపడుతున్నారు. చిరుతను పట్టుకోవాలని ఫారెస్ట్ అధికారులకు చాబోలు గ్రామస్థులు సమాచారం ఇచ్చారు.

Read more