పద్దసార్లూ పాఠాలు చెప్పాల్సిందే... ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

ABN , First Publish Date - 2021-02-28T09:09:16+05:30 IST

రాష్ట్రంలో వివిధ వర్సిటీల్లో పనిచేసే సీనియర్‌ ప్రొఫెసర్లందరూ పాఠాలు బోధించాల్సిందేనని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు

పద్దసార్లూ పాఠాలు చెప్పాల్సిందే... ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

అమరావతి: రాష్ట్రంలో వివిధ వర్సిటీల్లో పనిచేసే సీనియర్‌ ప్రొఫెసర్లందరూ పాఠాలు బోధించాల్సిందేనని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. సీనియర్లకు అడ్మినిస్ర్టేటివ్‌ బాధ్యతలు ఉన్నా.. అకడమిక్‌ యాక్టివిటీస్‌ను విస్మరించకూడదని చెప్పారు. ప్రతి ప్రొఫెసర్‌ క్లాసులు తీసుకోవాలని, ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదన్నారు. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి ప్రత్యేకదృష్టి సారిస్తుందని తెలిపారు. ఇక విద్యార్థులను ఫీజుల కోసం వేధించే ప్రైవేటు కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-02-28T09:09:16+05:30 IST