ఐకమత్యంలో హక్కులు సాధించుకుందాం

ABN , First Publish Date - 2022-10-04T05:15:52+05:30 IST

హక్కుల సాధనకు ఐకమత్యం తో పోరాటం చేద్దామని వడ్డెర విద్యావంతుల వేదిక నాయ కులు పిలుపునిచ్చారు.

ఐకమత్యంలో హక్కులు సాధించుకుందాం
ఐక్యతను ప్రదర్శిస్తున్న వడ్డెర సంఘం నాయకులు

సుండుపల్లె, అక్టోబరు 3:  హక్కుల సాధనకు ఐకమత్యం తో పోరాటం చేద్దామని వడ్డెర విద్యావంతుల వేదిక నాయ కులు పిలుపునిచ్చారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠ శాలలో సోమవారం ఏపీ వడ్డెర విద్యావంతుల వేదిక మండ ల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్య విద్యాసంస్థల ఏజీఎం రమణ, ప్రజాస్వామ్య హక్కు ల పరిరక్షణ సంస్థ నేత టీ. ఈశ్వర్‌  మాట్లాడుతూ రాష్ట్రం లో  40 లక్షల మందికి పైగా వడ్డెరలుండగా కనీసం జిలా ్లకు ఒకరికి కూడా రాజకీయ ప్రాధాన్యం కల్పించకుండా అణ చివేస్తున్నారన్నారు. ప్రతి పనిలోనూ వడ్డెర్ల శ్రమ 80 శాతం పైగా ఉండగా, రాజ్యాధికారం మాత్రం లేదని ఆరోపిం చారు. వడ్డెరలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమిం చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాయ చోటి మండల ప్రధాన కార్యదర్శి కోటకొండ రవిశంకర్‌,  సలహాదారులు రామారావు జయరాం, అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు కుంచపు రెడ్డెయ్య, చెల్లా రెడ్డెయ్య, బత్తల రమణ, న్యాయవాది పల్లపు నాగార్జున, వల్లెపు బాబు తదిత రులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కోకన్వీనర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో సుండుపల్లె మండల కమిటీ అధ్యక్షుడుగా బట్టల సాంబశివ,  ఉపాధ్యక్షుడుగా దేరంగుల వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శిగా పల్లపు మల్లికార్జున, ట్రెజరర్‌గా రమణ, సలహా కమిటీ స భ్యులుగా టీచర్‌ నాగార్జున, సుధాకర్‌, రవి ప్రకాష్‌, ఆవల కుంట రెడ్డెయ్య, గుడ్డిండ నాగార్జున, 15 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. 

Updated Date - 2022-10-04T05:15:52+05:30 IST