ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొడుదాం

ABN , First Publish Date - 2022-07-06T05:16:00+05:30 IST

ప్లాస్టిక్‌ వలన వాతావరణం కలుషితమై మానవాళి జీవనానికి ముప్పు వాటిల్లుతోందని, ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టి సహజసిద్ధమైన జ్యూట్‌ బ్యాగులను వాడాలని సీనియర్‌ సిటిజన్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు జగపతిరావు పిలుపునిచ్చారు.

ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొడుదాం
మాట్లాడుతున్న జగపతిరావు

- సీనియర్‌ సిటిజన్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు జగపతిరావు

మహబూబ్‌నగర్‌ టౌన్‌, జూలై 5 : ప్లాస్టిక్‌ వలన వాతావరణం కలుషితమై మానవాళి జీవనానికి ముప్పు వాటిల్లుతోందని, ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టి సహజసిద్ధమైన జ్యూట్‌ బ్యాగులను వాడాలని సీనియర్‌ సిటిజన్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు జగపతిరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పారిశ్రామిక వాడలోని ఫోరం కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. కాడ్మియం, సీసం వంటి విషపూరిత ధాతువులతో ప్లాస్టిక్‌ సం చులను తయారు చేస్తారని, ఈ సంచులను వాడినప్పుడు ఈ రసాయనాలు ఆహార పదార్థాలను కలుషితం చేస్తాయని అన్నారు. అవి శరీరంలోకి ప్రవేశిం చడం వల్ల వాంతులు, గుండె పెద్దది కావడంలాంటి ఇతర అనారోగ్య స మస్యలు ఏర్పడతాయన్నారు. ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రజల్లో అవ గాహన వివిధ రూపాల్లొ కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షే మ క్షేత్రస్థాయి అధికారి నాగరాజు, ప్రధాన కార్యదర్శి నాభూషణం, బాలయ్య, బాలకృష్ణ, వినోద్‌కుమార్‌, ఎ.రాజసింహుడు, సిద్దిరామ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T05:16:00+05:30 IST