మునిసిపల్ ఎన్నికలను సమర్థంగా నిర్వహిద్దాం
ABN , First Publish Date - 2021-03-01T05:29:33+05:30 IST
మునిసిపల్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించుకుందామని ఐటీడీఏ పీవో, ఎన్నిల ప్రత్యేకాధికారి కూర్మనాథ్ అన్నారు.
పార్వతీపురం, ఫిబ్రవరి 28: మునిసిపల్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించుకుందామని ఐటీడీఏ పీవో, ఎన్నిల ప్రత్యేకాధికారి కూర్మనాథ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీ లించారు. అనంతరం సంబంధిత ఎన్నికల నిర్వహణ అధికారులతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలంటే మనమంతా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. పోలింగ్కు పెద్దఎత్తున్న తరలివచ్చేందుకు ఓటు హక్కు గురించి ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఎన్నికలు నిర్వహించే అధికారులంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వారికి తమ వంతు సహాయ సహకారాలను అందించాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ కె. కనకమహాలక్ష్మి, ఎస్ఐ కళాధర్ తదితరులు పాల్గొన్నారు.