చంద్రబాబు పర్యటనను దిగ్విజయం చేద్దాం
ABN , First Publish Date - 2022-05-20T06:35:11+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పర్యటనను దిగ్విజయం చేయడానికి ప్రతి ఒక్కరు సమష్టిగా కృషిచేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపు నిచ్చారు.
మాజీమంత్రి పరిటాల సునీత
చెన్నేకొత్తపల్లి, మే 19: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పర్యటనను దిగ్విజయం చేయడానికి ప్రతి ఒక్కరు సమష్టిగా కృషిచేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపు నిచ్చారు. గురువారం ఆమె సీకేపల్లిలో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. చంద్రబాబు ప్రసంగించనున్న స్థలాన్ని బస్టాండ్ కూడలి సమీపంలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. జాతీయ రహదారి నుండి బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ చంద్రబాబునాయుడు ప్రసంగిస్తారని ఆమె తెలిపారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో నాయకులతో చర్చించారు. సీకేపల్లిలో చేపట్టిన చంద్రబాబు పర్యటనకు రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండ లాల నుండి పార్టీ శ్రేణులే కాకుండా ప్రజలు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా నాయకులంతా కృషి చేయాలన్నారు. మధ్యాహ్నం 2-30గంటలకు చెన్నేకొత్తపల్లిలో చంద్రబాబు పర్యటనను ముగించుకుని సోమందేపల్లికి వెళతారని తెలిపారు. సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు ఎల్ నారాయణచౌదరి, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు దండు ఓబుళేశు, రామ్మూర్తినాయుడు, పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు రంగయ్య, కన్వీనర్ ముత్యాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ముత్యాలు, నాయకులు న్యామద్దల కిష్టప్ప, హరినాథ్రెడ్డి, అంకే అమరేంద్ర, ఈడిగ భార్గవగౌడ్ పాల్గొన్నారు.