చలో విజయవాడను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2022-08-20T05:01:45+05:30 IST

కమిటీల పేరుతో కాలయా పన చేస్తూ సీపీఎస్‌ ఉద్యోగు లను నమ్మిస్తున్న రాష్ట్ర ప్రభు త్వానికి తమ డిమాండ్లు తె లిసేలా నిర్వహిస్తున్న చలో విజయ వాడ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా సీపీఎస్‌ ఉద్యో గుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌. శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

చలో విజయవాడను విజయవంతం చేయండి
చలో విజయవాడ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న సీపీఎస్‌ నేతలు

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 19: కమిటీల పేరుతో కాలయా పన చేస్తూ సీపీఎస్‌ ఉద్యోగు లను నమ్మిస్తున్న రాష్ట్ర ప్రభు త్వానికి తమ డిమాండ్లు తె లిసేలా నిర్వహిస్తున్న చలో విజయ వాడ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా సీపీఎస్‌ ఉద్యో గుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌. శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక సబ్‌ కలెకరేట్‌ ఆవరణలో సీపీఎస్‌ ఉద్యోగులు పోస్టర్లను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ పాదయాత్రలో సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి అధికా రంలోకి వచ్చి మూడేళ్లు అవుతు న్నా సీపీఎస్‌ రద్దుచేయకపోగా, జీపీఎస్‌ అనే కొత్త పెన్షన్‌ విధానం ప్రవేశపెడతా మనడం దుర్మార్గమన్నారు. సెప్టెంబరు 1న విజయవాడలో నిర్వహించనున్న మిలియన్‌ మార్చ్‌లో సీపీఎస్‌ ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం ఉద్యోగుల సంఘం నాయకులు వెంకటరమణ, రాజేంద్రప్రసా ద్‌, రంజిత్‌కుమార్‌, నరేంద్ర, అస్లాం, జ్యోతి, సుధాకర్‌, కిల్లా నాగరాజ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-20T05:01:45+05:30 IST