నా భర్త ఆచూకీ తెలపండి
ABN , First Publish Date - 2020-08-09T10:20:53+05:30 IST
తన భర్త ఆచూకీ తెలపాలని హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ జామిగుడకి చెందిన మర్రి కృష్ణకుమారి శనివారం ఐటీడీఏ పీవో డాక్టర్ ..
ర్యాలీగా వచ్చి ఐటీడీఏ పీవోకు వినతి
పాడేరు, ఆగస్టు 8: తన భర్త ఆచూకీ తెలపాలని హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ జామిగుడకి చెందిన మర్రి కృష్ణకుమారి శనివారం ఐటీడీఏ పీవో డాక్టర్ వెంకటేశ్వర్ వద్ద తనగోడు వినిపించింది. బీజేపీ నేతలు, గ్రామస్థులతో కలిసి ర్యాలీగా ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుని పీవోకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై పీవో వెంకటేశ్వర్ స్పందించారు. నాగేశ్వరరావు ఆచూకీపై తక్షణ చర్యలు చేపట్టాలని డీఎస్పీ రాజ్కమల్ను ఆదేశించారు. బీజేపీ నేతలు పాంగి రాజారావు, కురసా రాజారావు, సల్లారామకృష్ణ, జామిగుడ వాసులు పాల్గొన్నారు.
దర్యాప్తు జరుగుతోంది: డీఎస్పీ
జామిగుడకు చెందిన నాగేశ్వరరావు అదృశ్యంపై మార్చి 19న హుకుంపేట స్టేషన్లో కేసు నమోదైందని, దానిపై దర్యాప్తు చేపడుతున్నామని డీఎస్పీ వీబీ.రాజ్కమల్ తెలిపారు. నాగేశ్వరరావు ఒడిశా రాష్ట్రానికి వెళ్లినట్టుగా సమాచారం ఉందని, కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత ప్రత్యేక బృందాన్ని ఒడిశా రాష్ట్రానికి పంపిస్తామన్నారు.