మోదీ బహిరంగ సభను జయప్రదం చేద్దాం

ABN , First Publish Date - 2022-06-26T05:58:44+05:30 IST

మోదీ బహిరంగ సభను జయప్రదం చేద్దాం

మోదీ బహిరంగ సభను జయప్రదం చేద్దాం
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీవర్ధన్‌రెడ్డి

కొత్తూర్‌, జూన్‌ 25: జూలై 3న సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త నడుంబిగించాలని బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. శ్రీవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపాలిటీతో పాటు, మండల బీజేపీ సమావేశాలను శనివారం వేర్వేరుగా నిర్వహించారు. శ్రీవర్ధన్‌రెడ్డితో పాటు, బీజేపీ జిల్లా సీనియర్‌ నాయకుడు అమడపురం నర్సింహాగౌడ్‌లు హాజరయ్యారు. కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్‌, మండల శాఖ అధ్యక్షులు ఎర్రవెళ్లి నాగరాజుచారి, మల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి, నాయకులు మాణిక్యం, సుధాకర్‌రెడ్డి, శేఖర్‌గౌడ్‌, శ్రీశైలంగౌడ్‌, అరవింద్‌, వేణుగోపాల్‌చారి, రణధీర్‌గౌడ్‌, రాజారెడ్డి, ప్రవీన్‌, సురేష్‌, ప్రతా్‌పరెడ్డి, హరికృష్ణ, రమేష్‌, నర్సింగ్‌, శివలింగం పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-26T05:58:44+05:30 IST