ఇంటింటా జాతీయ జెండా ఎగురవేద్దాం

ABN , First Publish Date - 2022-08-11T05:13:54+05:30 IST

ఆజాదీ కా అమృత మహోత్సవ్‌లో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేద్దామని ధర్మవరం ప్రధాన తపాల శాఖా ధికారి వెంకటరామిరెడ్డి పిలుపు నిచ్చారు.

ఇంటింటా జాతీయ జెండా ఎగురవేద్దాం
బైకు ర్యాలీ నిర్వహిస్తున్న తపాలాశాఖ ఉద్యోగులు, సిబ్బంది


ధర్మవరం, ఆగస్టు 10: ఆజాదీ కా అమృత మహోత్సవ్‌లో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేద్దామని ధర్మవరం ప్రధాన తపాల శాఖా ధికారి వెంకటరామిరెడ్డి పిలుపు నిచ్చారు. స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తిఅవుతున్న సందర్భంగా తపాలశాఖ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ‘ఇంటింటా జాతీయ జెండాను ఎగురవేద్దాం, భారతీయతను చాటుతామ’ంటూ బైకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తపాల శాఖ ఉప అధికారి వేదాంతులు, తిరుపాల్‌నాయక్‌, ఆర్‌ఆర్‌ నాగేశ్వరరావు, సిబ్బంది బుడ్డన్న, సుబ్బాచారీ, వెంకకటరాముడు, సోమరాజు, నరసింహరాజు, రాజేశ, సూర్యకళ కమల, జాన్సీలక్ష్మీ, ఏజెంట్లు ప్రభాకర్‌గుప్తా, నాగభూణం, రాఘవేంద్ర, కోనాపురం సాయిప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-11T05:13:54+05:30 IST