మినీమహానాడులో బీసీల సత్తా చాటుదాం

ABN , First Publish Date - 2022-07-01T05:43:08+05:30 IST

మదనపల్లెలో నిర్వహించనున్న మినీమహానాడు విజయ వంతం చేసి బీసీల సత్తా చాటుదామని నియోజకవర్గ టీడీపీ బీసీ విభాగం అధ్యక్షుడు ఎం.నాగయ్య పిలుపునిచ్చారు.

మినీమహానాడులో బీసీల సత్తా చాటుదాం


మదనపల్లె టౌన్‌, జూన్‌ 30: మదనపల్లెలో నిర్వహించనున్న మినీమహానాడు విజయ వంతం చేసి బీసీల సత్తా చాటుదామని నియోజకవర్గ టీడీపీ బీసీ విభాగం అధ్యక్షుడు ఎం.నాగయ్య పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మార్కెట్‌యార్డులో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మదన పల్లెలో మినీమహానాడు నిర్వహిస్తున్నారని నియోజకవర్గంలోని మూడు మండలాల నుంచి బీసీలు అందరూ తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. చంద్రబాబునాయుడును మళ్లీ సీఎం చేయాలనే సంకల్పంతో గ్రామాలల్లో పర్యటించి కార్యకర్తలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.  కార్యక్రమంలోటీడీపీ బీసీ సెల్‌ నాయకు లు రామ్మూర్తి, శివరెడ్డి, రెడ్డిశంకర, అమర, నాగరాజు, వెంకటరమణ పాల్గొన్నారు.


Updated Date - 2022-07-01T05:43:08+05:30 IST