మంత్రి పర్యటనను విజయవంతం చేద్దాం

ABN , First Publish Date - 2022-05-18T04:48:00+05:30 IST

మంత్రి కేటీఆర్‌ పర్యటనను విజయవంతం చేద్దామని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

మంత్రి పర్యటనను విజయవంతం చేద్దాం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

- వచ్చేనెల 4న కోస్గికి మంత్రి కేటీఆర్‌ రాక 

- కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి 

కోస్గి, మే 17 : మంత్రి కేటీఆర్‌ పర్యటనను విజయవంతం చేద్దామని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కోస్గిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ జూన్‌ 4న కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలిపారు. కోస్గి పరిధిలో గల ఆర్టీసీ బస్‌ డిపో పర్చువల్‌ సమావేశం, మునిసిపల్‌ కార్యాలయ ప్రారంభోత్సవం, రూ.1.80 కోట్లతో ధోబిఘాట్‌, రెండు కోట్లతో రెండెకరాల్లో నాగసాన్‌పల్లి ఇంటిగ్రేటెడ్‌ పార్కుతో పాటు రూ.22 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన సైతం త్వరలో చేస్తామన్నారు. అదే విధంగా చాకలి వారికి సంబంధించిన వస్తువులు, విద్యుత్‌ తదితర సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ మధుకర్‌రావు, సింగిల్‌ విండో చైర్మన్‌ భీంరెడ్డి, హన్మంత్‌రెడ్డి, మ్యాకల రాజేశ్‌, ఓంప్రకాశ్‌, బాలేశ్‌, మాస్టర్‌ శ్రీను, జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T04:48:00+05:30 IST