ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం
ABN , First Publish Date - 2022-10-01T05:27:51+05:30 IST
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దామని జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జి భూపే్షరెడ్డి తెలిపారు.
జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జి భూపే్షరెడ్డి
కొండాపురం, సెప్టెంబరు 30: మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దామని జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జి భూపే్షరెడ్డి తెలిపారు. మండలంలోని మురుగంపల్లె, ఎస్.కొత్తపల్లె, సంకేపల్లె గ్రామాలలో శుక్రవారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, గండ్లూరు నాగేశ్వరరెడ్డి, కోటా ఓబుళరెడ్డి, నరసింహారెడ్డి, గోపాల్, కోటా బ్రదర్స్, అరుణ్కుమార్రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.