లగుడు సింహాద్రి ఆశయాలను కొనసాగిద్దాం
ABN , First Publish Date - 2021-03-06T05:47:18+05:30 IST
మాజీ జడ్పీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ కురువృద్ధుడు లగుడు సింహాద్రి ఆశయ సాధనకు కార్యకర్తలు, నాయకులు చిత్తశుద్ధితో కృషి చేసి పార్టీని పటిష్ఠం చేయాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, శోభా హైమావతి తెలిపారు.
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి
శృంగవరపుకోట రూరల్, మార్చి 5: మాజీ జడ్పీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ కురువృద్ధుడు లగుడు సింహాద్రి ఆశయ సాధనకు కార్యకర్తలు, నాయకులు చిత్తశుద్ధితో కృషి చేసి పార్టీని పటిష్ఠం చేయాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, శోభా హైమావతి తెలిపారు. శుక్రవారం సింహాద్రి తనయుడు లగుడు రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాపసభలో పాల్గొని మాట్లాడారు. టీడీపీ పుట్టుక నుంచి ఆయన పార్టీకి ఎంతో సేవచేశారని, పార్టీ అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన ఆయన్ను స్ఫూర్తిగా తీసు కుందామని కోరారు. మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, రిటైర్డ్ న్యాయమూర్తి సబ్బవరపు సూర్యనా రాయణ, లోక్సత్తా రాష్ట్ర నాయకుడు భీశెట్టి బాజ్జీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాంప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా లగుడు సింహాద్రి చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంతాపసభ కార్యక్రమం అనంతరం అన్నదానం నిర్వహించగా 5వేలమంది పాల్గొన్నారు.