రైల్వే ప్రైవేటీకరణను అడ్డుకుందాం
ABN , First Publish Date - 2021-11-29T06:09:15+05:30 IST
రైల్వేలో ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో కార్మికులు ముందుకు రావాలని ఎస్సీఆర్ఎంయూ నాయకులు పిలుపునిచ్చారు.
రేణిగుంట, నవంబర్ 28: రైల్వేలో ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో పోరాటానికి కార్మికులు ముందుకు రావాలని సౌత్సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజన్ నాయకులు కాల్వ శ్రీనివాసులు, ఉదయ్భాస్కర్ పిలుపునిచ్చారు. తిరుపతి మార్గంలోని సీఆర్ఎస్ ఆవరణలోని సంఘ కార్యాలయంలో డివిజనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. నాయకులు ప్రసంగిస్తూ... ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వర్క్షాపుల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నూతన పింఛను విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో మురళీధరన్, సరోజినీరెడ్డి, అరుణకుమార్, ఆర్.ఎ.నాయక్, బుజ్జిరెడ్డి, వినోద్బాబు, శ్రీనివాసరావు, సురేంద్రరెడ్డి, బాబు పాల్గొన్నారు.