చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడదాం: సుబ్బారెడ్డి

ABN , First Publish Date - 2022-05-21T05:29:40+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డోన్‌ నియోజకవర్గ ప్రజలపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా పని చేద్దామని టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.

చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడదాం: సుబ్బారెడ్డి
ప్యాపిలిలో సుబ్బారెడ్డిని సన్మానిస్తున్న నాయకులు

డోన్‌, మే 20: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డోన్‌ నియోజకవర్గ ప్రజలపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా పని చేద్దామని టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. సుబ్బారెడ్డిని పట్టణంలోని ఆయన నివాసంలో శుక్రవారం పలువురు టీడీపీ నాయకులు కలిసి అభినందించారు. టీడీపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ డోన్‌లో ఆర్థిక మంత్రి బుగ్గనను ఓడించాలన్న చంద్రబాబు ఆశయాన్ని నెరవేరుద్దామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, మల్లెంపల్లి జయన్నయాదవ్‌, గోసానిపల్లి రాజశేఖర్‌ రెడ్డి, శ్రీరాములు, శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.


‘డోన్‌లో టీడీపీ జెండా ఎగురవేస్తాం’


ప్యాపిలి: డోన్‌ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండాను ఎగురవేస్తామని టీడీపీ డోన్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుబ్బారెడ్డిని డోన్‌ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడంపై స్థానిక టీడీపీ నాయకులు శుక్రవారం ప్యాపిలిలో ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ తనను డోన్‌ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సుబ్బారెడ్డి పార్టీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు గండికోట రామసుబ్బయ్య, నాయకులు ఎర్రగుంట్లపల్లి వెంకటేశ్వరరెడ్డి, రామ్మోహన్‌యాదవ్‌, చిన్నసుంకయ్య, ఎస్‌మధు, నాగేంద్ర, మౌళాలిరెడ్డి, సూరి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-21T05:29:40+05:30 IST