‘టీడీపీ గెలుపే లక్ష్యంగా పని చేద్దాం’

ABN , First Publish Date - 2022-01-27T06:50:47+05:30 IST

డోన్‌ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేద్దామని టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు.

‘టీడీపీ గెలుపే లక్ష్యంగా పని చేద్దాం’

డోన్‌, జనవరి 26: డోన్‌ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేద్దామని టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. ప్యాపిలి పట్టణ టీడీపీ కమిటీ అధ్యక్షుడు  సుంకయ్యతోపాటు పలువురు నాయకులు డోన్‌లోని ధర్మవరం సుబ్బారెడ్డి నివాసంలో కేక్‌ను కట్‌ చేశారు. కమిటీలో అవకాశం కల్పించినందుకు సుబ్బారెడ్డిని గజమాలతో  సన్మానించారు.  సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా నూతన కమిటీ పని చేయాలన్నారు. డోన్‌లో టీడీపీ జెండాను ఎగురవేసేందుకు అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. డోన్‌ పట్టణ టీడీపీ అధ్యక్షుడు సీ.ఎం.శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, ప్యాపిలి మండల అధ్యక్షుడు గండికోట రామసుబ్బయ్య పాల్గొన్నారు. 


బేతంచెర్ల: రాష్ట్రంలో అరాచక  వైసీపీ  పాలనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు చరమగీతం  పాడతారని  డోన్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని సిమెంటు నగర్‌గ్రామంలో ఉన్న టీడీపీ సీనియర్‌ నాయకురాలు బండారు విజయలక్ష్మి, సుబ్బారావు దంపతులను, కుటుంబ సభ్యులను బేతంచెర్ల టీడీపీ మండల కన్వీనర్‌ ఎల్లనాగయ్య ఆధ్వర్యంలో ధర్మవరం సుబ్బారెడ్డి, మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. మండలంలో టీడీపీ అభివృద్ధికి సహకరించాలని బండారు విజయలక్ష్మి దంపతులను ఆయన కోరారు.  డోన్‌ మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణగౌడు, నంద్యాల పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షుడు  పోలూరు వెంకటేశ్వరరెడ్డి, నంద్యాల పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి విజయభట్టు, మండల టీడీపీ నాయకులు పోలూరు రాఘవరెడ్డి, తిరుమలేష్‌ చౌదరి, ఉన్నం చంద్రశేఖర్‌, కేవీ సుబ్బారెడ్డి, బేతంచెర్ల పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షావలి చౌదరి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T06:50:47+05:30 IST