ఆలయాల అభివృద్ధికి కృషిచేద్దాం
ABN , First Publish Date - 2022-08-16T05:41:06+05:30 IST
ప్రజ ల్లో ఆఽధ్యాత్మికతను పెంచడానికి ఆల యాల అభివృద్ధి చేయాలని ఏపీ తొగటవీరక్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోడెంవీరాంనేయ ప్రసా ద్ పేర్కొన్నారు.
మదనపల్లె అర్బన్, ఆగస్టు 15: ప్రజ ల్లో ఆఽధ్యాత్మికతను పెంచడానికి ఆల యాల అభివృద్ధి చేయాలని ఏపీ తొగటవీరక్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోడెంవీరాంనేయ ప్రసా ద్ పేర్కొన్నారు. సోమవారం కోళ్లబై లు పంచాయతీ, వైఎస్సార్కాలనీలో చౌడేశ్వరీదేవి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గుడ్లనాగరాజ ఆధ్వ ర్యంలో అమ్మవారి విగ్రహప్రతిష్ఠ వైభ వంగా నిర్వహించారు. ఆలయకమిటీ సభ్యులు కళశాలతో అమ్మవారిని అభిషేకించారు. ఆలయంలో ఉదయం చౌడేశ్వరీదేవికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేకాలంకరణలో పూజ లు నిర్వహించారు. అనంతరం అధికసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఆలయంలో వేలాదిమందికి భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో తొగటకులస్థుల గురువు జ్ఞానానందగిరి స్వామీజీ, తొగటవీరక్షత్రిసంఘం రాష్ట్ర కార్యదర్శి బొమ్మిశెట్టి కృష్ణమూర్తి, పట్టణ అధ్యక్షుడు ఉప్పురామచంద్ర, తొగట కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ శీలం రమణమ్మ, రమేష్, ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయకమిటీ చైర్మన్ పురాణం వెంకటరత్నం, బీజేపీ వెంకటేష్, కౌన్సిలర్లు ఎస్వీరమణ, వెంకటశివారెడ్డి, మందపల్లె రమణ, మాజీ కౌన్సిలర్లు, సభ్యులు పర్యవేక్షించారు.