సమస్యలను సంఘటితంగా ఎదుర్కొందాం

ABN , First Publish Date - 2021-07-24T05:11:55+05:30 IST

వ్యాపారుల సమస్యలను సంఘటితంగా ఎదుర్కొందా మని జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘ అధ్యక్షుడు మల్లా సురేష్‌కుమార్‌ కోరారు. శుక్రవారం స్థానిక పీసీఎంఏ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కేవీ శివకృష్ణ అధ్యక్షతన జీడి వ్యాపారుల సర్వసభ్య సమా వేశం నిర్వహించారు.

సమస్యలను సంఘటితంగా ఎదుర్కొందాం
మాట్లాడుతున్న సంఘం అధ్యక్షుడు మల్లా సురేష్‌కుమార్‌

జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘ సమావేశం

పలాస, జూలై 23 : వ్యాపారుల సమస్యలను సంఘటితంగా ఎదుర్కొందా మని జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘ అధ్యక్షుడు మల్లా సురేష్‌కుమార్‌ కోరారు. శుక్రవారం స్థానిక పీసీఎంఏ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కేవీ శివకృష్ణ అధ్యక్షతన జీడి వ్యాపారుల సర్వసభ్య సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రస్తు తం జీడి పరిశ్రమలు లాభసాటిగా లేవని, కరోనా కారణంగా ఉత్పత్తులు స్థానికంగానే పరిమితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది పూర్తిగా వ్యాపారులు నష్టపోయామని, దీని నుంచి గట్టెక్కుతున్న సమయం లో సెకెండ్‌ వేవ్‌తో మరిన్ని కష్టాలు ఎదురోవాల్సి వచ్చిందన్నారు. ఈ సంద ర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. కోశాధికారి పట్నాన రవిఘకాంత్‌,  సంఘం మాజీ అధ్యక్ష, కార్యదర్శులు మల్లా శ్రీనివాస్‌, శాసనపురి మురళీకృష్ణ, సిందిరి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

Updated Date - 2021-07-24T05:11:55+05:30 IST