చంద్రబాబు పర్యటనను విజయవంతం చేద్దాం

ABN , First Publish Date - 2022-05-18T05:45:18+05:30 IST

టీడీజీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేద్దామని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత పిలుపునిచ్చారు.

చంద్రబాబు పర్యటనను విజయవంతం చేద్దాం
మాట్లాడుతున్న గౌరు వెంకటరెడ్డి

టీడీపీ నాయకులు, కార్యకర్తలకు గౌరు దంపతుల పిలుపు


కల్లూరు, మే 17: టీడీజీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేద్దామని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని మాధవీనగర్‌లోని తన స్వగృహంలో సాయంత్రం కల్లూరు అర్బన్‌ 16 వార్డులు, కల్లూరు, ఓర్వకల్లు మండలాల టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో గౌరు దంపతులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18వ తేదీ బుధవారం కర్నూలులో బస చేస్తారని, 19వ తేదీ గురువారం నందికొట్కూరు రోడ్డులోని కమ్మ సంఘంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు.



వెల్దుర్తి:
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని పత్తికొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు కోరారు. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో కృష్ణగిరి మండల నాయకులు, కార్యకర్తలతో ఆయన బొమ్మిరెడ్డిపల్లె సుబ్బరాయుడు స్వగృహంలో సమావేశం ఏర్పాటు చేశారు.  కేఈ శ్యాం బాబు మాట్లాడుతూ ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటలకు బొమ్మిరెడ్డిపల్లెకు చేరుకుంటారని, బొమ్మిరెడ్డి పల్లె కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పుల్లగుమ్మి నాగేశ్వరరెడ్డి, మండల అధ్యక్షుడు బలరామ్‌గౌడు, సూదెపల్లె జయరాముడు, సుధాకర్‌గౌడు, చర్లకొత్తూరు పుల్లయ్య, కోదండపాణి, వీరభద్రుడు, ఖాజా మొహిద్దీన్‌, రామకృష్ణ, కృష్ణగిరి మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.



పెద్దకడుబూరు:
కర్నూలులో గురువారం జరిగే టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారని, మండలంలో అన్ని గ్రామాల నుంచి పార్టీ కార్యకర్త్తలు పెద్దఎత్తున హాజరు కావాలని టీడీపీ రాష్ట్ర రైతు సంఘం అధికార ప్రతినిధి రమాకాంత్‌ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు బసలదోడ్డి ఈరన్న, టౌన్‌ ప్రెసిడెంట్‌ మల్లికార్జున పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దకడబూరులోని విలేఖర్ల సమావేశంలో మా ట్లాడుతూ రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి తీసుకోరావడానికి చంద్రబాబుని సీఎం చేసే వరకు ప్రతి కార్యకర్త ముందుకు రావాలన్నారు.




Updated Date - 2022-05-18T05:45:18+05:30 IST