ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

ABN , First Publish Date - 2021-12-03T05:39:15+05:30 IST

రాష్ట్రంలో ప్రజలపై భారాలు మోపుతూ, ప్రశ్నించే పార్టీలపై అక్రమ కేసులు, వేధింపులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణకు శ్రీకారం చుట్టామని టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మౌలాన ముస్తాక్‌ అహమ్మద్‌ అన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

  1. టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్‌ అహమ్మద్‌


నంద్యాల, డిసెంబరు 2: రాష్ట్రంలో ప్రజలపై భారాలు మోపుతూ, ప్రశ్నించే పార్టీలపై అక్రమ కేసులు, వేధింపులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణకు శ్రీకారం చుట్టామని టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మౌలాన ముస్తాక్‌ అహమ్మద్‌ అన్నారు. గురువారం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కలిసినట్లు ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను క్షేత్రస్థాయిలో ప్రజలకు విశదీకరించామని, వైసీపీకి చరమగీతం పాడితేనే రాష్ట్రం బాగుపడుతుందని చంద్రబాబు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు దిశనిర్ధేశం చేసినట్లు తెలిపారు. వరదలు వచ్చి రైతులు, ప్రజలు అల్లాడిపోతుంటే, కనీసం పలుకరించే స్థితిలో కూడా వైసీపీ ప్రభుత్వం లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మైనార్టీలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 



Updated Date - 2021-12-03T05:39:15+05:30 IST