కరోనా నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం
ABN , First Publish Date - 2021-05-11T04:48:25+05:30 IST
రాజంపేట ప్రాంతంలో రోజురోజుకు ఎక్కువవుతున్న కరోనా నియంత్రకు సమష్టిగా కృషి చేద్దామని రాజంపేట మున్సిపల్ కమిషనర్ ఎం.జనార్దన్రెడ్డి పేర్కొన్నారు.
రాజంపేట మున్సిపల్ కమిషనర్ జనార్దన్రెడ్డి
రాజంపేట, మే10 : రాజంపేట ప్రాంతంలో రోజురోజుకు ఎక్కువవుతున్న కరోనా నియంత్రకు సమష్టిగా కృషి చేద్దామని రాజంపేట మున్సిపల్ కమిషనర్ ఎం.జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాజంపేట మున్సిపల్ కార్యాలయ సభాభవనంలో కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా అధికారులతో ఏర్పాటు చేసిన సమిక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సిన్ను రెండో డోసు మాత్రమే అందరికీ వేయాలన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, అన్ని శాఖల అధికారులు కరోనా నియంత్రణకు చాలా కష్టపడుతున్నారని ఇదే స్ఫూర్తితో మరికొన్ని రోజులు కష్టపడి ప్రజల సహకారంతో దీనిని నియంత్రించాలన్నారు. రాజంపేట తహసీల్దారు రవిశంకర్రెడ్డి మాట్లాడుతూ కొవిడ్ రెండో డోసు వ్యాక్సినేషన్లో అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మెడికల్ అధికారి డాక్టర్ హిమబిందు, అర్బన్ సీఐ చంద్రశేఖర్, రూరల్ ఎస్ఐ రోషన్, పంచాయతీ రాజ్ డీఈ వేణుగోపాల్, టౌన్ప్లానింగ్ అధికారి అసీఫ్ తదితరులు పాల్గొన్నారు.