మౌలిక వసతుల కల్పనకు కృషి చేద్దాం
ABN , First Publish Date - 2021-01-25T03:12:59+05:30 IST
నూతన మండలం కావడంతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేద్దామని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు.
ఊర్కొండ, జనవరి 24: నూతన మండలం కావడంతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేద్దామని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన మండలంలో వసతులకు ఇబ్బందులున్న దృష్ట్యా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతా క్రమంలో నిర్మాణాలు చేపడుతామని అన్నారు. వారి వెంట సర్పంచ్ కోమ్మురాజయ్య, వైస్ ఎంపీపీ అరుణ్రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గిరినాయక్, నాయకులు గోపాల్రెడ్డి, బక్క జంగయ్య, రమేష్, మ్యాకల శ్రీనివాసులు, అమరేశ్వర్రెడ్డి, యాదయ్య, గోపి ఉన్నారు.