Manikkam Tagoreకు జడ్చర్ల ఇన్చార్జ్ అనిరుధ్ రెడ్డి లేఖ
ABN , First Publish Date - 2022-08-18T15:33:56+05:30 IST
కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్కు జడ్చర్ల ఇన్చార్జ్ అనిరుధ్ రెడ్డి లేఖ రాశారు.
జడ్చర్ల: కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్(Manikkam Tagore)కు జడ్చర్ల ఇన్చార్జ్ అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy ) లేఖ రాశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై లేఖలో పేర్కొన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఇటీవల పార్టీలో ఎర్రశేఖర్ (Errasekhar) తీరుపై అనిరుధ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి నుంచి పార్టీలో పని చేసుకుంటున్న తనకు ఎర్రశేఖర్ ఇబ్బందులు గురి చేస్తున్నారని ప్రస్తావించారు. పలు కేసులలో నిందితుడిగా ఉన్న ఎర్రశేఖర్తో స్టేజ్ పంచుకోలేనంటూ ఠాగూర్కు లేఖలో చెప్పారు. ఎర్రశేఖర్ చేరే సందర్భంగా ఒక మాట.. ఇప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారంటూ అనిరుధ్ రెడ్డి ఆవేదన చెందారు.