సీఎం జగన్‌కు సోమువీర్రాజు లేఖ.. పథకంపై అభ్యంతరం

ABN , First Publish Date - 2020-11-27T02:25:47+05:30 IST

సీఎం జగన్మోహన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు లేఖ రాశారు

సీఎం జగన్‌కు సోమువీర్రాజు లేఖ.. పథకంపై అభ్యంతరం

అమరావతి: సీఎం జగన్మోహన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు లేఖ రాశారు. ‘కేంద్ర పథకాన్ని.. జగనన్న తోడు పథకంగా ప్రకటించడాన్ని ఖండిస్తున్నాం. లాక్‌డౌన్ సమయంలో చేతివృత్తులవారు ఉపాధి కోల్పోయారు. కనీసం ప్రధాని ఫొటో కూడా పెట్టకుండా ప్రచారం‌ చేసుకుంటారా? ప్రభుత్వం వెంటనే జగనన్న తోడు పథకం పేరును ఉపసంహరించుకోవాలి.  కేంద్ర పథకాలను ఉపయోగించినప్పుడు ప్రధాని మోడీ చిత్రాలను ఉంచాలి’ అని సోము వీర్రాజు లేఖలో డిమాండ్ చేశారు.

Updated Date - 2020-11-27T02:25:47+05:30 IST