కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకు జగ్గారెడ్డి లేఖ

ABN , First Publish Date - 2021-08-27T17:29:06+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్‌లోని కీలక నేతలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖలు రాశారు. తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ ఇంఛార్జి ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీలు

కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకు జగ్గారెడ్డి లేఖ

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లోని కీలక నేతలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖలు రాశారు. తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ ఇంఛార్జి ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీలు బోస్ రాజు,  శ్రీనివాసన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజెషన్ ఇంచార్జ్ మహేష్ గౌడ్‌కు జగ్గారెడ్డి లెటర్ రాశారు. ఈ లేఖలో ప్రతి నెల ఆయన చేసే పనులను నిశితంగా వివరించారు. ‘ఎమ్మెల్యేగా ప్రతి నెల 20 రోజులు సంగారెడ్డి నియోజకవర్గానికి కేటాయించడం జరుగుతుంది. నెలలో 6 రోజులు రెండు మున్సిపాలిటీ వార్డుల్లో నిరంతర కార్యక్రమాలు, సమస్యలపై ప్రజలతో చర్చించడం, వారు చెప్పిన వాటికి పరిష్కార మార్గాలు వెతకడం ప్రజలతో కలువడం జరుగుతుంది. ప్రెసిడెంట్‎గా 10 రోజులు పార్టీకి కేటాయించడం జరుగుతుంది. ఈ పది రోజుల్లో ప్రతి నెల 4 రోజులు పార్లమెంట్ ఇంచార్జిగా ఉన్న ఖమ్మం, భువనగిరి, కరీంనగర్, వరంగల్ పార్లమెంట్‎లకు సమయం కేటాయించి అక్కడ ముఖ్యనేతలతో కలిసి పార్టీ కోసం సమన్వయం చేయడం జరుగుతుంది’ అని లేఖలో జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-08-27T17:29:06+05:30 IST