జగన్కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల లేఖ
ABN , First Publish Date - 2021-07-16T21:45:02+05:30 IST
సీఎం జగన్కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టును వెంటనే కేంద్ర గెజిట్లో చేర్చాలని లేఖలో కోరారు.
అమరావతి: సీఎం జగన్కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టును వెంటనే కేంద్ర గెజిట్లో చేర్చాలని లేఖలో కోరారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై పునరాలోచించాలని సూచించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల రైతాంగానికి నష్టం జరగకుండా నీటిని అందించాలన్నారు. రెండేళ్లు అయినా అడుగు ముందుకు పడటం లేదని లేఖలో ఎమ్మెల్యేలు విమర్శించారు. టీడీపీకి చెందిన అద్దంకి, పర్చూరు, కొండపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, స్వామిలు జిల్లాకు పొంచి ఉన్న ప్రమాదాన్ని సూటిగా తెలియజేస్తూ సీఎంకి లేఖ రాసిన విషయం తెలిసిందే. వ్యవసాయ ఆధారితమైన ప్రకాశం జిల్లా ఆర్థికాభ్యున్నతికి కృష్ణాజలాలే దిక్కు. అలాంటి సమయంలో ప్రస్తుత తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు జిల్లాను పూర్తిస్థాయిలో ఎడారిగా మారుస్తాయంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. సాగర్ కుడికాలువ పరిధిలోని ప్రకాశం జిల్లాకు అన్యాయం చేస్తూ నీటిని రాయలసీమకు తరలించే ప్రతిపాదనను పక్కనబెట్టాలని కోరారు.