ప్రధానమంత్రికి లేఖ రాశా: నాగం జనార్దన్‌‌రెడ్డి

ABN , First Publish Date - 2021-07-20T20:13:44+05:30 IST

ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశానని మాజీమంత్రి నాగం జనార్దన్‌‌రెడ్డి తెలిపారు. కృష్ణ జలవివాదంపై ప్రధాని, కేంద్ర జలశక్తి మంత్రి

ప్రధానమంత్రికి లేఖ రాశా: నాగం జనార్దన్‌‌రెడ్డి

హైదరాబాద్: ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశానని మాజీమంత్రి నాగం జనార్దన్‌‌రెడ్డి తెలిపారు. కృష్ణ జలవివాదంపై ప్రధాని, కేంద్ర జలశక్తి మంత్రి స్పందించాలని కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణ జలాలను వాడుకునే హక్కు.. కృష్ణ బేసిన్ ప్రజలకే ఉందన్నారు. ఏపీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమకు నీళ్ల దోపిడీ ఎక్కువైందని, తెలంగాణ వచ్చాక మరింత అన్యాయం జరుగుతుందని చెప్పారు. కృష్ణనది పరివాహక ప్రాంతాల జిల్లాలకు నీళ్లు ఇచ్చాకే పక్క రాష్ట్రానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రులు బానిసలుగా ఉన్నారని జనార్దన్‌‌రెడ్డి తప్పుబట్టారు.

Updated Date - 2021-07-20T20:13:44+05:30 IST